'పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను పరిష్కరించండి'

W.G: భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల వద్ద నుండి కలెక్టర్ నాగరాణి 210 అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.