తాగునీటి కొరత తలెత్తకుండా చూడాలి: మంత్రి
NDL: బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి RWS అధికారులతో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలన్నారు. సమస్యలు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు.