మై రెస్టారెంట్పై కేసు నమోదు
VSP: విశాఖలోని మై రెస్టారెంట్లో ఆహార భద్రతా శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ. 30 వేలు విలువైన 30 కిలోల నిల్వ ఆహారాన్ని గుర్తించారు. రెండు మూడు రోజులు ఫ్రిజ్లో ఉంచిన ఈ ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే ఆ నిల్వ ఆహారాన్ని ధ్వంసం చేసి, రెస్టారెంట్పై కేసు నమోదు చేశారు.