రేపల్లె రైల్వేస్టేషన్‌లో డీఆర్ఎం పర్యటన

రేపల్లె రైల్వేస్టేషన్‌లో డీఆర్ఎం పర్యటన

BPT: రేపల్లె రైల్వే స్టేషన్‌లో నూతన భవనాల నిర్మాణ పనులను డీఆర్‌ఎం సుధీష్ణ సేన్ బుధవారం పరిశీలించారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్, గుంటూరు - తిరుపతి రైళ్లు రావడానికి ప్లాట్‌ఫాం పొడవు సరిపోవడం లేదని గుర్తించిన ఆమె.. 2, 3 బోగీలకు సరిపడా ప్లాట్‌ఫాం పొడవు పెంచాలని అధికారులకు సూచించారు. కొత్త స్టేషన్ భవనాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.