శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 66,966 మంది భక్తులు దర్శించుకోగా.. 21,535మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా నమోదైంది.