వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
SKLM: ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి భూమి, పెన్షన్, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి అనేక సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రతి వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.