ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేతుల మీదుగా జలహారతి

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్కు గురువారం కృష్ణా జలాలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం వారు కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.