108లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
ADB: రూరల్ మండలంలోని తిప్ప గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ కోవ సుగుణకు గురువారం ఉదయం 5 గంటలకు పురిటి నొప్పులు రాగా 108లో RIMSకి తరలిస్తూండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కాగా EMT కైలాష్ డెలివరీ చేసారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. మెరుగైన చికిత్స కోసం రిమ్స్లో అడ్మిట్ చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని EMT కైలాష్, పైలట్ రాజేష్ తెలిపారు.