నూతన ఎంఈవోగా నర్సింహులు
SRD: విద్యాభివృద్ధి కోసం బాధ్యతతో కృషి చేస్తానని నూతన MEO నర్సింహులు అన్నారు. రాయికోడ్ మండల వనరుల కేంద్రంలో బుధవారం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆఫీసు సిబ్బంది ఆయనకు స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు.