రిలీజ్కు సిద్ధమైన 'లేచింది మహిళా లోకం'
మంచు లక్ష్మీ, అనన్య నాగళ్ల, హేమ వంటి నటీమణులు ప్రధాన పాత్రల్లో నటించిన ఓ మహిళా ప్రాధాన్య చిత్రం 'లేచింది మహిళా లోకం'. కార్తీక్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2022లోనే ప్రారంభమైనా అనివార్యకారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్కు రెడీ అయినట్లు మేకర్స్ ప్రకటించారు.