తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల వేంకటేశ్వరుడిని 73,670 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 26,062 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.