కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్
HYD: కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయనున్నట్లు HYD సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. బంజారాహిల్స్లో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేసుల నమోదు దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.