పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ విజయవంతం
PDPL: సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ పంచాయతీ వార్డుసభ్యుల కోసం నిర్వహించిన 5రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, నిధుల వినియోగం, గ్రామసభల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. ముగింపు సందర్భంగా ఎంపీడీఓ దివ్యదర్శన్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.