చనిపోయిన అభ్యర్థికి 165 ఓట్లు
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థికి 165 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన బుచ్చిరెడ్డి ఈనెల 9న గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు ఎన్నికల అధికారులు బ్యాట్ గుర్తు కేటాయించగా.. ఇవాళ జరిగిన పోలింగ్లో 165 ఓట్లు పడ్డాయి.