జనగణన-2027కు శ్రీకారం

జనగణన-2027కు శ్రీకారం

పల్నాడు: జిల్లాలో జనగణన-2027లో భాగంగా నేటి నుంచి 30 వరకు స్వీయగణన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. వివిధ వర్గాలకు షెడ్యూల్ ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పాల్గొనాలని ఆమె కోరారు.