సీఎం, మంత్రి లోకేష్కు ప్రయాణికుల కృతజ్ఞతలు
కృష్ణా: సింగపూర్–విజయవాడ నేరుగా ఇండిగో విమాన సర్వీసుల ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు తొలి ఫ్లైట్లో ప్రయాణించడానికి గన్నవరం ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంతోషంతో వారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.