కువైట్లో కడప జిల్లా వాసి మృతి..!
KDP: పోరుమామిళ్ల మండలం పెద్ద ఎర్రసాలకి చెందిన సూరే సుబ్బయ్య ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.