ప్రమోషన్తో బాధ్యతలు పెరుగుతాయి: ఎస్పీ

SRPT: ప్రమోషన్తో బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వ్లో కానిస్టేబుల్స్గా పనిచేస్తున్న వీరబాబు, మహేష్, జానయ్య హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి పొందడంతో ఉత్తర్వులు జారీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలకు అనుగుణంగా విధులు నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.