నేడే కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఇందుకోసం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 18వేల మందికిపైగా సిబ్బంది ఈ లెక్కింపు చేయనున్నారు.