'సమస్యల పరిష్కారమే ధ్యేయం'
VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డు కార్పొరేటర్ ఉరికిటి నారాయణరావు మంగళవారం మార్నింగ్ వాక్లో భాగంగా శ్రీరంగపురం ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, యూజీడీ, శానిటరీ, తాగునీరు, సీసీ రోడ్లు వంటి సమస్యలపై దృష్టి సారించే నారాయణరావు, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.