దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేత
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ సీత రామచంద్ర స్వామి వారి దేవస్థానం పునః నిర్మాణానికి పీర్జాదిగూడ కార్పోరేషన్ 5వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్ రూ.1,00,101 లను విరాళంగా ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ లోడే చంద్రయ్య గౌడ్, వైస్ ఛైర్మన్ మిరుపాటి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.