డయేరియాపై ఆందోళన చెందొద్దు: కలెక్టర్ లక్ష్మీశ

డయేరియాపై ఆందోళన చెందొద్దు: కలెక్టర్ లక్ష్మీశ

AP: డయేరియాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటికీ హైజీన్ కిట్లు, సబ్బులు, హ్యాండ్‌వాష్, పినాయిల్, ORS ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని, డయేరియాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నం. 91549 70454ను సంప్రదించాలన్నారు.