నూతన సర్పంచులను సన్మానించిన మాజీమంత్రి

నూతన సర్పంచులను సన్మానించిన మాజీమంత్రి

ADB: గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు మాజీమంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన అభ్యర్థులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీకి పట్టం కట్టారని జోగు రామన్న పేర్కొన్నారు.