లక్ష్మీ దాస్ను సత్కరించిన సీఎం చంద్రబాబు
కృష్ణా: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలో నిర్వహించిన ఆత్మీయ విందులో పామర్రు నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లక్ష్మీ దాస్ను సత్కరించారు. అనంతరం పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి, అధికారంలోకి రావడానికి కృషి చేసిన అతడిని అభినందించారు.