ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి

SKLM: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కోటబొమ్మాలి మండలంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అధికారులతో చరవాణిలో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.