జియ్యాని అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు

VSP: విశాఖ జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై భూ అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కలెక్టర్కు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా.. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గిడిజాలలో ప్రభుత్వ భూమిని జియ్యాని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.