షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన కలెక్టర్
JGL: రాబోయే రబీ సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ (M) ముత్యంపేట గ్రామంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంగళవారం ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గోదాములు వడ్ల నిల్వలకు అనువుగా ఉన్నాయా అని సమగ్రంగా పరిశీలించారు. ఆయన వెంట మెట్పల్లి ఆర్డీవో నరసింహా రావు, అధికారులు పాల్గొన్నారు.