మొబైల్ ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్
MDCL: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం నంబర్ 1 వెయిటింగ్ హాల్లో మొబైల్ ఎత్తుకెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15,000 విలువైన చోరీకి గురైన సామ్ సింగ్ గెలాక్సీ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసిన ఆస్తిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం జీఆర్పీకి అప్పగించారు.