నేడు ఘనంగా గుజరాత్ పట్టణ ప్రగతి వేడుకలు

గుజరాత్ పట్టణ ప్రగతి వేడుకలు నేడు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. కాగా, నిన్న గుజరాత్ వడోదరలో పాల్గొన్న మోదీ పలు కార్యక్రమాలను ప్రారంభించారు.