పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆదివారం పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలతో పాటు కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సత్ప్రవర్తనతో వ్యవహరించాలని వారికి సూచించారు. రౌడీ షీటర్లపై నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు.