డిపోలకే పరిమితమైన బస్సులు
RR: నేటి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హయత్ నగర్లోని డిపో 1, డిపో 2 లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.