హనుమాన్ భక్త శోభాయాత్రపై ఎస్సైకు వినతి పత్రం

హనుమాన్ భక్త శోభాయాత్రపై ఎస్సైకు వినతి పత్రం

NLR: సంగంలో ఈ నెల 26న హనుమాన్ భక్త శోభాయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమం శాంతియుతంగా, విజయవంతంగా జరిగేందుకు అవసరమైన బందోబస్తును ఏర్పాట్లు చేయాలని కోరుతూ శోభాయాత్ర కమిటీ సభ్యులు సంగం ఎస్సై రాజేష్‌కు గురువారం వినతి పత్రం సమర్పించారు. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.