పలు దేవాలయాలకు పాలక మండళ్లు
AKP: అనకాపల్లి పరిధిలో పలు దేవాలయాలకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సిఫార్సుతో ప్రభుత్వం శుక్రవారం పాలకమండళ్లను నియమించింది. నూకంబిక అమ్మవారి ఆలయానికి ఛైర్మన్గా పీలా నాగ శ్రీనుని నియమించింది. హిమగిరి సత్యనారాయణ దేవస్థానం ఛైర్మన్ గా ఏ. గణేష్, సుంకరమెట్ట సూర్యనారాయణమూర్తి దేవస్థానం ఛైర్మన్గా బి.మురళి, జగన్నాథ స్వామి ఆలయ ఛైర్మన్గా డి. బుజ్జి నియమితులయ్యారు.