నేడు నీటి సరఫరాకు అంతరాయం
HYD: పైపులైన్లకు మరమ్మతుల కారణంగా నేడు పలు ప్రాంతాలకు నీటిసరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. బీరంగూడ, అమీన్ పూర్, మియాపూర్, దీప్తిశ్రీ నగర్, కేపీహెచ్బీ, హౌసింగ్ బోర్డ్, నిజాంపేట్, హైదర్ నగర్, మూసాపేట్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాలకు శనివారం మధ్యాహ్నం వరకు నీటి సరఫరా నిలిచిపోనుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.