VIDEO: కార్మిక సమ్మెకు వామపక్షాల పిలుపు

KRNL: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న జరగనున్న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చారు. బుధవారం కోడుమూరులో AITUC మండల కార్యదర్శి M.చిన్న రాముడు, CITU మండల కార్యదర్శి వీరన్న, కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో BJP ప్రభుత్వం, కార్మికుల పట్ల వివక్షత చూపుతోందన్నారు.