గంజాయి నిర్మూలనకు పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

గంజాయి నిర్మూలనకు పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

అన్నమయ్య: రైల్వే కోడూరు పరిధిలోని వత్తులూరు వడ్డిపల్లిలో ఆదివారం సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.