కొయ్యూరు ఎంఈవో నియామకం
ASR: కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారిగా పాటి సింహాచలం నియమితులయ్యారు. కొయ్యూరు మండలంలోని రావణాపల్లి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న సింహాచలం ఇటీవల పదోన్నతి పొందారు. ఈమేరకు, ఆయన సోమవారం కొయ్యూరు ఎంఈవోగా నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.