ఈ నెల 13న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా
SDPT: ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఈ నెల 13న ఇర్కోడ్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామానుజ తెలిపారు. పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనే ఈ మేళాకు అభ్యర్థులు వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.