'గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి'
SDPT: గజ్వేల్లో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఇవాళ పర్యటించారు. అనంతరం కుకునూరుపల్లి సర్పంచ్ మల్లం కనుకవ్వ ఐలయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.