భక్తులకు దర్శనమిచ్చిన నందవరం చౌడేశ్వరి మాత
NDL: చంద్రగ్రహణం వీడడంతో నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య పూజలైన రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.