జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు

జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు

E.G: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు మార్చి నెల జీతం వెంటనే చెల్లించాలని కొవ్వూరులో మంగళవారం ధర్నా నిర్వహించారు. CITU పిలుపుమేరకు పారిశుద్ధ్య కార్మికులు పనులు నిలిపివేసి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు భూపతి రవీంద్ర అధ్యక్షతన నిరసన చేపట్టారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే పారిశుద్ధ్య పనులు ఆగిపోతాయని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని కోరారు.