ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరాలి: మంత్రి

VZM: ప్రతీ పౌరునిలో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత కోరారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ వద్ద ఆమె గురువారం సెల్ఫీ దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు.