ప్రమాదవశాత్తు రైతుల గడ్డివాము దగ్ధం
ప్రకాశం: పెద్దారవీడు మండలం రామాయపాలెం గ్రామంలో రైతులు సంబంధించిన గడ్డివాములు మంగళవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గొల్ల రాజారావు మురారి వెంకటయ్యలకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంతో పూర్తిగా దగ్ధమయ్యయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదాలకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.