సచివాలయాల్లో తనిఖీ చేసిన ఎంపీడీవో
SKLM: పొందూరులోని మొదలవలస సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో వాసుదేవరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు ఫైళ్లను తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ సర్వే, ఇంటి పనులు చెల్లింపు మొదలగు వివరాలను పరిశీలించి సిబ్బందికి నిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారి పాలన విషయం గురించి చర్చించారు