BREAKING: బావిలో పడ్డ కారు.. 9 మంది మృతి

BREAKING: బావిలో పడ్డ కారు.. 9 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్‌ జిల్లాలో ఓ కారు బావిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతిచెందారు. నాసిక్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని దిండోరిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి చీకట్లో బావిని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.