మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడికి రికార్డు ఆదాయం.!
కృష్ణా: ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్కరోజులో వివిధ సేవల టికెట్ల ద్వారా రూ. 9,57,379 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరించారు.