ఎంపీ‌ని కలిసిన ఎమ్మెల్యే శిరీష

ఎంపీ‌ని కలిసిన ఎమ్మెల్యే శిరీష

NTR: విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్‌ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ శిరీషను శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మ బహుకరించారు. ఈ సందర్భంగా ఇద్దరూ రాష్ట్ర రాజకీయాలపై పలు అంశాలు చర్చించారు.