కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
KMM: వేంసూరు మండల కేంద్రానికి చెందిన మరకంటి నాగరాజు కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజుకు ప్రాథమిక చికిత్స అందించారు. హైదరాబాద్ 108 కాల్ సెంటర్ వైద్యుడు వినయ్ సూచనలతో మెరుగైన వైద్యం కోసం అతన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.