ఏపీ పాలిసెట్‌లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు

ఏపీ పాలిసెట్‌లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు

ATP: సాంకేతిక విద్యా శిక్షణ మండలి విడుదల చేసిన పాలిసెట్-2025 ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 7,908 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 4,824 మంది బాలురు, 3,084 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 91.89% గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 95.01% గా నమోదైంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 93.11%గా ఉంది.