డయాలసిస్ సెంటర్ను పరిశీలించిన ఎమ్మెల్యే
RR: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడడంపై DCHS అనురాగిణి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి డయాలసిస్ సెంటర్, పాలియేటివ్ కేర్ను పరిశీలించారు. పాలియేటివ్ కేర్లో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు నివేదికలు పంపారని, వారం రోజుల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని DCHS అనురాగిణి తెలిపారు.